రాష్ట్రంలో తొలిసారిగా అవినీతి నిరోధక శాఖ (యాంటీ కరెప్షన్ బ్యూరో) శాఖను ఏర్పాటు చేయడంతో ఆది కాస్తా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య మెడకే చుట్టుకుంది. ఓ వైపు పార్టీ సీనియర్ల చేత విమర్శల పాలైన ఆయన మరోవైపు అధిష్టానం ఆగ్రహానికి కూడా గురయ్యారు. ఇక దీంతో అవినీతి నిరోధక శాఖ ఏర్పటు చేయడంపై ఆయన పునరాలోచనలో పడినట్లు సమాచారం. ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం ఏసీబీ ఏర్పాటుపై వివరణ కూడా కోరినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం అవినీతి కేసుల దర్యాప్తు కోసం లోకాయుక్త ఉన్న విషయం తెలిసిందే. ఈ సంస్థకు దేశంలోనే అత్యున్నత దర్యాప్తు సంస్థగా గుర్తింపు ఉంది. అయినా కూడా సిద్ధు అవినీతి నిరోధక శాఖ ఏర్పాటు చేస్తూ ఇటీవల తీసుకున్న నిర్ణయం అధిష్టానానికి ఆగ్రహం కల్గిస్తోంది.
ఏసీబీని ఏర్పాటు చేయడం ఆ శాఖకు ఐపీఎస్ అధికారులను కూడా నియమించారు. అయితే ఈ శాఖను నిర్వీర్యం చేయడానికి అధికార కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందని విపక్షాలతో పాటు న్యాయనిపుణులు కూడా పేర్కొంటున్నారు. అంతేకాకుండా ప్రజలు కూడా ప్రభుత్వ చర్యలను తప్పుపడుతున్నారు. ఇదిలా ఉండగా ఏసీబీ విషయమై కాంగ్రెస్ పార్టీ వేదికపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాట మాత్రమైనా చర్చించలేదని ఆ పార్టీకి చెందిన కొంతమంది సీనియర్ నేతలు హైకమాండ్కు ఫిర్యాదు చేశారు.
అంతేకాకుండా ఏసీబీ ఏర్పాటు తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయని, ఇదే విషయాన్ని వారు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. అంతేకాకుండా సిద్ధరామయ్య బడ్జెట్ రూపకల్పన సమయంలో కూడా పార్టీ సీనియర్ నేతలను సంప్రదించలేదని వారు పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.ఎం కృష్ణ ‘బడ్జెట్ రూపకల్పనకు ముందు సీఎం సిద్ధు నన్ను సంప్రదించలేదు. ఇది సరికాదు. అడిగి ఉంటే సలహాలు ఇచ్చేవాడిని’ అని బహిరంగంగా ఆక్రోశించిన విషయం తెలిసిందే.
ఇలా అన్ని విషయాల్లోనూ సిద్ధరామయ్య ఏకపక్షంగా వ్యవహరిస్తూ సీనియర్ నాయకులను నిర్లక్ష్యం చేస్తున్నారని హైకమాండ్కు ఫిర్యాదు చేసిన నేతలు వాపోయారు. దీంతో ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ సూచన మేరకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్ సింగ్ ఈ విషయమై సీఎం సిద్ధును వివరణ కోరినట్లు కాంగ్రెస్ పార్టీ నాయకులే పేర్కొంటున్నారు. అసలే వాచ్ వివాదం విషయంలో హైకమాండ్ ఆగ్రహానికి గురైన సిద్దుకు ఏసీబీ ఏర్పాటుతో తనకు తానుగా చిక్కుల్లో పడినట్లు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more