రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు.
తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే.. రాజకీయ సుస్థిరత కూడా అంతే ముఖ్యమని భావించామని, అంతేగానీ ఫిరాయింపులు తమ ప్రధాన ఉద్దేశం కాదని ఆయన వెల్లడించారు. టెండర్లలో అవినీతి జరుగుతుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయని.. కానీ, వాటిని నిరూపించలేకపోయానని ఆయన అన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత టిఆర్ఎస్ ఉంటుందా అంటూ కొందరు కాంగ్రెస్ నేతలు అవహేళన చేశారని తెలంగాణ సీఎం కెసిఆర్ చెప్పారు. తెలంగాణకు చెందిన కొందరు కాంగ్రెస్ నేతలు ఇంకా ఘోరంగా మాట్లాడారని కెసిఆర్ గుర్తు చేసుకొన్నారు. ఆనాడు తమ పార్టీకి చెందిన ఎంపీ విజయశాంతిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొన్నారని కెసిఆర్ చెప్పారు. ప్రస్తుతం విజయశాంతి ఎక్కడుందన్నారు. విజయశాంతిని అడవులకు పంపారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
తెలంగాణను అభివృద్ధి చేసుకోవటమే లక్ష్యంగా టీఆర్ఎస్ శ్రేణులు పని చేస్తున్నాయన్నారు. గతంలో సచివాలయంలో పైరవీ ముఠాలు యథేచ్ఛగా ఉండేవని.. ఇప్పుడు ఎలాంటి అవినీతి కనిపించటం లేదన్నారు.
* మిషన్ కాకతీయ కింద 17 వేల చెరువులు బాగుపడ్డాయని తెలిపారు
* పరిశ్రమలకు 15 రోజుల్లోనే అనుమతులు ఇస్తున్నాం.
* చాలా అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నాం.
* తెలంగాణలో ప్రజలు సంతృప్తిగా ఉన్నారు.
(And get your daily news straight to your inbox)
Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more
Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more
Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more
Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more
Dec 20 | అనంతపురం అభివృద్ధికి ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అర్ధరూపాయి కూడా ఖర్చు చేయలేదని మేయర్ స్వరూప విమర్శించారు. ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ జేసీపై మండిపడ్డారు. అనంతపురం అభివృద్ధికి అడ్డుపడుతున్న రాక్షసుడు జేసీ అని,... Read more