రాష్ట్ర విభజన ప్రకటన తరువాత సమైక్యాంద్ర కోసం ఆందోళనలు ఆకాశాన్ని తాకాయి. కేసిఆర్ మీడియా ముందు ఆంద్ర ఉద్యోగులు హైదరాబాద్ నగరం విడిచి వెళ్లిపోండి? వారి ప్రాంతాలకు వెళ్లాల్సిందే? వారికి ఎలాంటి ఆఫ్షన్ లేదు అని కారు కూతులు కూసి తరువాత హైదరాబాద్ నగరంలో ఉద్యోగులు రెండు వర్గాలుగా విడిపోయారు. సీమాంద్ర ఉద్యోగులు ఒక యూనిట్ గా ఏర్పడి, సీమాంద్ర ఉద్యోగులు జేఏసి అని నామకరణం చేసుకున్నారు. అలాగే తెలంగాణ ప్రాంత ఉద్యోగులు విడిపోయి మరో వర్గంగా మారిపోయారు. ఏపీ ఎన్జీవో ఉద్యోగులు, టీజీ ఎన్జీవో ఉద్యోగులు తెరపైకి వచ్చారు. ఈ ఇద్దరి మద్య కొన్ని చోట్లు మాటల యుద్దానికి దారి తీసి, చివరకు తోపులాట వరకు వెళ్లిందంటే.. వీరి మద్య ఎంత వైర్యం ఉన్నదో రాష్ట్ర ప్రజలకు తెలిసిపోయింది. ఈ ఇద్దరి మద్య తగదాలు పెట్టి, తన్నుకోండి అని చెప్పిన కేసిఆర్ మాత్రం ఫామ్ హౌస్ లో.. పల్లీల బిర్యానీ తింటూ హాయిగా ఉన్నాడు. అయితే ఉద్యోగుల మద్య ఉద్రేకం మాత్రం రోజు రోజుకు పెరిగిపోతుంది. వీరి మద్య ఉద్రేకాన్ని ఎవరు తగ్గిస్తారు? అది ఎవరి వల్ల సాద్యం అవుతుంది? అది కేవలం ఒక్క దైవం వల్ల అవుతుంది. అవును నిజంగానే అదే జరిగింది. ఉద్రేకంతో ఊగిపోతున్న ఉద్యోగులను ‘నల్లపోచమ్మ ’ శాంతి పరిచింది. ఆవేశంతో ఊగిపోతున్న ఉద్యోగులను చల్లని తల్లి నల్లపోచమ్మ తన ఓడిలోకి చేర్చుకొని ఇద్దరిపై ప్రేమానురాగాలు కురిపించింది.
ఇది మన సచివాలయం సాక్షిగా తన ఇద్దరి బిడ్డలను నల్లపోచమ్మ శాంతిపరిచింది. తెలంగాణ ప్రాంతంలో బోనాల ఉత్సవాలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఒక ప్రాంతం పండుగ అని లేకుండా ఇరు ప్రాంతాల ఉద్యోగులు నల్లపోచమ్మ కు బోనాలు సమర్పించారు. ఈ సందర్బంలో తమ మద్య ఉన్న వైరం మరిచిపోయి.. సీమంద్ర ఉద్యోగులు, తెలంగాణ ప ప్రాంత ఉద్యోగులు కలిసి బోనాల ఉత్సవాలు జరుపుకొని కొత్త అర్థానికి నాంది పలికారు. నిన్నటి ఆందోళనలతో మారుమ్రోగిపోయినసచివాలయం ఒక్కసారిగా భక్తి భావంతో, సోదర భావంతో ఉద్యోగులు ఒక్కటయ్యారు. నల్లపోచమ్మ అమ్మవారి ఆలయం వద్ద జరిగిన బోనాల ఉత్సవాల్లో వీరంతా కలిసిపోయి పూజలు నిర్వహించారు. ఇరు ప్రాంత ఉద్యోగులు కలిసి ఉత్సవాల్లో పాల్గొన్నారు. అందరు కలిసి ఒకేచోట భోజనాలు చేయటం జరిగింది. ఇలా కలిసి కలకలం ఉండాలని నల్లపోచమ్మను అందురు వేడుకున్నారు.
(And get your daily news straight to your inbox)
Dec 26 | నేటి అర్థరాత్రి నుండి నగరంలోని చెత్త ఎక్కడికక్కడే పేరుకొని పోనుంది. హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని కార్మికులు నేటి అర్థరాత్రి (గురువారం) నుండి సమ్మెకు దిగబోతున్నారు. కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో జాప్యం... Read more
Dec 18 | నేతల అవినీతివల్లే ధరలు పెరిగిపోయాయని, అవినీతి కేన్సర్ లాంటిదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ నాయుడు పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో... Read more
Dec 17 | రాష్ట్ర విభజన బిల్లుపై శాసనసభలో చర్చ ప్రారంభమైందన్న వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో.. ప్రస్తుత శాసనసభ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేయించి విభజన బిల్లుపై మరోసారి ప్రత్యేక సమావేశాలు పెట్టించాలని ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి, సీమాంధ్ర మంత్రులు... Read more
Dec 16 | ఆంద్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును చైర్మన్ చక్రపాణి మండలిలో ప్రవేశ పెట్టిన నేపథ్యంలో శాసనమండలి మీడియా పాయింట్ వద్ద తెదేపా, తెరాస ఎమ్మెల్సీల మద్య వాగ్వాదం, తోపులాట జరిగింది. మండలి వాయిదా పడిన అనంతరం... Read more
Dec 13 | విభజనపై సీమాంధ్ర ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, 2014 సాధారణ ఎన్నికల లోపు రాష్ట్ర విభజన జరగదని చిన్ననీటి పారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ పేర్కాన్నారు. రాష్ట్ర విభజనకు పార్లమెంట్లో మూడింట రెండొంతుల... Read more