టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఒక్కటేనని, అందుకే ఎంపీలు వివేక్, మందా, విజయశాంతిలు పార్టీలు మారినా వారిని సస్పెండ్ చేయలేదని టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రశేఖర్రెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ తెలుగుజాతిని చీల్చి అతి పెద్ద తప్పు చేశారని అన్నారు. కాంగ్రెస్లో కలిసేందుకు టీఆరఎస్, వైసీపీలు ఇష్టపడ్డాయని అన్నారు.
ఈ రాష్ట్రం దిగ్విజయ్ సింగ్ తాత సొత్తు కాదని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. మధ్య ప్రదేశ్లో డిగ్గీ తీసేసిన తహసీల్దారు లాంటివారని ఎద్దేవా చేశారు. ఎంపీలు జగన్నాథం, వివేక్లు టీఆర్ఎస్ లో కీలకపాత్ర పోషిస్తుంటే సస్పెండ్ చేసే దమ్ము లేదా అని సోమిరెడ్డి ప్రశ్నించారు.
సీమాంధ్రలో కాంగ్రెసు - వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు ఇష్టపడితే, తెలంగాణలో కాంగ్రెసు - టీఆర్ఎస్ లు ఇష్టపడ్డాయని ఆయన ఎద్దేవా చేశారు. రాయలసీమను విభజించాలన్న డిమాండ్ న్యాయసమ్మతం కాదన్నారు. నిధులు, నీళ్ల పైన స్పష్టత లేకుండా రాష్ట్రాన్ని ఎలా విభజిస్తారని సోమిరెడ్డి ప్రశ్నించారు. సమన్వయ కమిటీ సమావేశాన్ని హైదరాబాదులో పెట్టుకునే దమ్ము లేదా అన్నారు. అన్ని కుట్రలు ఢిల్లీ నుండి చేస్తారా అని ఆయన ధ్వజమెత్తారు. రాజ్యాంగవిరుద్ధంగా చేసే ప్రక్రియను వెంటనే ఆపాలని సోమిరెడ్డి డిమాండ్ చేశారు.
అన్ని పార్టీలు ఏకంకావాలి-
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు అన్ని పార్టీలు ఏకంకావాలని వైసిపి అధినేత జగన్ మోహన్ రెడ్డి కోరారు. వైసిపి కార్యాలయంలో మాట్లాడారు. రాష్ట్ర విభజనకు అనుకూలంగా టిడిపి ఇచ్చిన లేఖను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికీ తాత్సారం చేస్తే ఆ పార్టీ భవిష్యత్తు అంధకారమే అవుతుందన్నారు. జి
ఓఎం కు పార్టీ తరపునుంచి మైసూరా రెడ్డిని పంపించనున్నట్లు తెలిపారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని జిఓఎం కు నివేదిస్తామని చెప్పారు. రాష్ట్రాన్ని విభజించే విషయంలో కేంద్రం అనుసరిస్తున్న తీరును అఖిలపక్షంలో ఎండగడతామని అన్నారు. విభజన సమస్యపై జిఓఎం బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తుందని విమర్శించారు. విభజనతో ఇరు రాష్ట్రాల మధ్య జలవనరుల పంపిణీకి సంబంధించి 'మండలి' దాని కింద బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.
తమ స్వార్ధ రాజకీయ ప్రయోజనాలకోసమే కాంగ్రెస్ రాష్ట్ర విభజనకు పూనుకుందని విమర్శించారు.సమైక్య ఉద్యమంలో పాల్గొన్న వారందరికీ , సమైక్య రాష్ట్రాన్ని కోరుతూ గ్రామసభల ద్వారా తీర్మానాలు చేసి కేంద్ర హోంశాఖకు పంపించిన గ్రామపంచాయతీలకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర సమైక్యత కోసం ఈ నెల 16 నుంచి 26 వరకు దేశవ్యాప్త పర్యటన చేస్తున్నట్లు చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Dec 26 | నేటి అర్థరాత్రి నుండి నగరంలోని చెత్త ఎక్కడికక్కడే పేరుకొని పోనుంది. హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని కార్మికులు నేటి అర్థరాత్రి (గురువారం) నుండి సమ్మెకు దిగబోతున్నారు. కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో జాప్యం... Read more
Dec 18 | నేతల అవినీతివల్లే ధరలు పెరిగిపోయాయని, అవినీతి కేన్సర్ లాంటిదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ నాయుడు పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో... Read more
Dec 17 | రాష్ట్ర విభజన బిల్లుపై శాసనసభలో చర్చ ప్రారంభమైందన్న వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో.. ప్రస్తుత శాసనసభ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేయించి విభజన బిల్లుపై మరోసారి ప్రత్యేక సమావేశాలు పెట్టించాలని ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి, సీమాంధ్ర మంత్రులు... Read more
Dec 16 | ఆంద్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును చైర్మన్ చక్రపాణి మండలిలో ప్రవేశ పెట్టిన నేపథ్యంలో శాసనమండలి మీడియా పాయింట్ వద్ద తెదేపా, తెరాస ఎమ్మెల్సీల మద్య వాగ్వాదం, తోపులాట జరిగింది. మండలి వాయిదా పడిన అనంతరం... Read more
Dec 13 | విభజనపై సీమాంధ్ర ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, 2014 సాధారణ ఎన్నికల లోపు రాష్ట్ర విభజన జరగదని చిన్ననీటి పారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ పేర్కాన్నారు. రాష్ట్ర విభజనకు పార్లమెంట్లో మూడింట రెండొంతుల... Read more