వైసీపీ అధినేత జగన్ సోనియాగాంధీ పెంపుడు చిలక అని , ఆమె పలకమన్నదే ఆయన పలుకుతూ, తన పత్రికల్లో రాస్తూ ఛానల్లో చూపిస్తారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పామర్రులో టీడీపీ కార్యాలయంలో మాట్లాడారు.
ఢిల్లీలోని 10జనపథ్ ఆదేశాల మేరకే వైసీపీ కార్యకలాపాలు రూపుదిద్దుకుంటున్నాయన్నారు. రాష్ట్ర విభజన ప్రకటన వచ్చిన జూలై 31నుంచి సోనియాకువ్యతిరేకంగా పతాక శీర్షకలో ఏ ఒ క్క ఐటమ్ కూడా ప్రచురించలేదన్నారు, విభజనకు సంబంధం లేని టీడీపీ అధినేత చంద్రబాబును గురించి పుంఖాను పుంఖాలుగా వార్తలు రాయడంలోని ఆంతర్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు.
ప్రమాదవశాత్తు మృతి చెందిన వైఎస్ పార్థివ దేహం ఇంటికి చేరక ముందే ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని ఆతృతతో సంతకాల సేకరణ జరిపిన జగన్ నేడు రాష్ట్ర విభజన జరగక ముందే 13జిల్లాలకు పరిమితమై సీమాంధ్రకు ముఖ్యమంత్రి కావాలని తహతహలాడుతున్నారన్నారు. కాంగ్రెస్ వ్యతిరేక ఓటును, ప్రజా సమస్యలపై పోరాడుతున్న తెలుగుదేశం పార్టీకి కాకుండా జగన్ పార్టీ బుట్టలో వేయించాలని పథకం రూపొందించారన్నారు.
ఢిల్లీ లో చంద్రబాబు దీక్షలు చేపట్టినప్పుడు రెండు రైళ్లు కావాలని కోరగా అడుగడుగునా అడ్డంకులు కల్పించిన ప్రభుత్వం హైదరాబాద్ లో జగన్ సమైక్య శంఖారావం సభకు 14రైళ్ళు ఆఘమేఘాల మీద ఏర్పాటు చేశారన్నారు. జగన్ వాదం సమైక్యవాదం కాదని, సోనియావాదం అవడం వల్ల ఇలా ఏర్పాట్లు చేశారన్నారు.
సోనియాకి జగన్ సరెండర్ ప్రక్రియ వేగవంతం అయ్యింది నిజం కాదా అని ప్రశ్నించారు. సీబీఐ కేసులో వాదోపవాదాలు త్వరితగతిన పూర్తి చేసి శిక్షవేయించి అనర్హత వేటుకు బలి చేస్తామనే బూచి చూపించి జగన్ జుట్టు సోనియా తన చేతిలో పెట్టుకుందన్నారు.
సీఎం కిరణ్కుమార్రెడ్డిగాని రాష్ట్రంలో కాంగ్రెస్లో ముఖ్య నాయకులు కాని జగన్ అవినీతిపై ప్రశ్నించకపోవడం సోనియా, జగన్ల కుమ్మక్కులో భాగమేనన్నారు. సోనియాకు వ్యతిరేకంగా జగన్ తన పత్రికల్లో వార్తలు ప్రచురించినా, పన్నెత్తి మాట మాట్లాడినా జైలు పాలవడం ఖాయమని వర్ల స్పష్టం చేశారు.
(And get your daily news straight to your inbox)
Dec 26 | విజయవాడ దివంగత మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగా 25వ వర్థంతి నగరంలో ఘనంగా జరిగింది. ఈయన వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయిన వంగవీటి రాధ ఆయన విగ్రహానికి... Read more
Dec 18 | పార్టీలను బలోపేతం చేసుకోవడంలో తలమునకలుకావాల్సిన పార్టీలు విభజన, సమైక్య పోరులో మునిగి పోయాయి..ప్రజలను ఎన్నికల మూడ్లోకి తేవాల్సి ఉన్నప్పటికీ ఆ విధంగా చేసే పరిస్థితి కనిపించడంలేదు.. ఫలితంగా ప్రధాన రాజకీయ పార్టీలు మల్ల గుల్లాలు... Read more
Dec 17 | మున్సిపల్ కార్మికులు.. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వీధులను శుభ్ర పరుస్తూ కష్టం చేస్తుంటారు.. వీరి కష్టానికి తగిన వేతనం మాత్రం అధికారులు ఇవ్వడం లేదు..తమకు వేతనాలివ్వలని కోరుతున్నా అధికారులు స్పందించడం లేదని కార్మికులు పేర్కొంటున్నారు.వేతనాలివ్వాలని... Read more
Dec 07 | ఆంధ్ర ప్రదేశ్ విభజనకు నిర్ణయం తీసుకున్నందుకు కాంగ్రెస్ పార్టీ కూర్చున్న కొమ్మనే నరుక్కుంటోందని పార్టీ కేంద్ర నాయకత్వంపై కిరణ్ కుమార్ విరుచుకుపడ్డారు. విజయవాడలో ఈరోజు సాయంత్రం జరిగిన పులిచింతల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కిరణ్... Read more
Dec 06 | రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ నేడు సీమాంధ్ర జిల్లాల బంద్కు ఏపీఎన్జీవోలు పిలుపునిచ్చారు. ఈ మేరకు విజయవాడలోని ఏపీఎన్జీవోల భవన్లో రాత్రి ఏర్పాటు చేసిన సమావేశంలో అశోక్బాబు మాట్లాడారు. సీమాంధ్ర... Read more