తెలంగాణ శాసనసభలో ఇవాళ సాయంత్రం ఒక్కసారిగా వేడెక్కింది. అధికార, విపక్ష సభ్యుల మధ్య వాడీవేడీ చర్చకు దారితీసిన నేపథ్యంలో కాంగ్రెస్ సభ్యురాలు ఏకంగా డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డిని టార్గెట్ చేసుకుని చేసిన వ్యాఖ్యాలు సభలో కలకలం రేపాయి. వాటిని అమె తీవ్రంగా కలత చెందిన కంటతడిపెట్టారు. ఒకానోకదశలో సభ నుంచి కాంగ్రెస్ సభ్యురాలిని సస్పెండ్ చేసే వరకు స్థాయి వరకు వెళ్లినా.. మళ్లీ అదే డిఫ్యూటీ స్పీకర్ తన ఔదర్యాన్ని చూపుతు.. సభ్యుల విజ్ఞతకే వదిలేస్తున్నట్లు చెప్పడమే కాకుండా.. అమెపై సస్పెన్షన్ మోషన్ మూవ్ చేయాల్సిన అవసరం లేదని వద్దని మంత్రిని రిక్వెస్ట్ చేశారు.
సంస్కారం లేనివారు సభను నిర్వహిస్తున్నారంటూ మంగళవారం సభలో కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకె అరుణ వ్యాఖ్యలు చేశారు. దీంతో మనస్తాపం చెందిన పద్మా దేవేందర్ రెడ్డి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు జోక్యం చేసుకుని 'మహిళ పట్లచ అందులోనూ డిఫ్యూటీ స్పీకర్ పట్ల అనుచిత వ్యాఖ్యలు తగవని అన్నారు. సభాపతిని డిక్టేట్ చేయడం సరికాదని, డీకే అరుణ వెంటనే క్షమాపణ చెప్పాలని' డిమాండ్ చేశారు. క్షమాపణ చెప్పకపోతే సస్పెండ్ చేయడానికి వెనుకాడేది లేదని హరీశ్ రావు స్పష్టం చేశారు.
ఏపీ శాసనసభలో ఏం జరిగిందో అందరికీ తెలుసు అని, అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఓ మహిళ ఎమ్మెల్యేను ఏడాదిపాటు సభనుంచి సస్పెండ్ చేశారని, అయితే తాము అలాంటి చర్యకు పోదలచుకోలేదని అన్నారు. గతంలో తాము సభలో మాట జారితే తమ నాయకుడు...మంత్రులతో క్షమాపణ చెప్పించారని హరీశ్ రావు గుర్తు చేశారు. అది తమ సంస్కారమని, క్షమాపణ చెబితే కిరీటమేమీ పడిపోదని ఆయన అన్నారు. మరోవైపు డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ తనపై చేసిన వ్యాఖ్యలకు సభ్యుల విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు.
ప్రతిపక్ష నేత జానారెడ్డి మాట్లాడుతూ సభలో అందరూ హుందాగా వ్యవహరించాలని సూచించారు. సభాపతిపై ప్రతిపక్షానికి గౌరవముందని, సభ్యులు ఆవేశపడినా గతంలో తాము సర్ధుబాటు చేసిన ఘటనలు ఉన్నాయని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. దీనిపై వాదాపవాదాలు వద్దని అందరూ సమన్వయం పాటించాలని జానారెడ్డి విజ్ఞప్తి చేశారు. దీనిపై డీకే అరుణ మాట్లాడుతూ... తాను ఎవరిపైనా అనుచిత వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more