రాష్ట్రంలో మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు హుస్సేన్ సాగర్ నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరింది. హుస్సేన్ సాగర్ గరిష్ట నీటి మట్టం స్థాయి 513.51 అడుగులు కాగా ప్రస్తుతం 513.25 అడుగులకు చేరుకుంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే సాగర్ పొంగిపొర్లే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దీంతో అధికారులు అప్రమత్తం అయ్యారు.
దోమలగూడ, హిమాయత్ నగర్, అశోక్ నగర్, రత్నానగర్, అరుంధతినగర్, అరవింద్ నగర్, శివానంద్ నగర్ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. సుమారు 13 ఏళ్ల క్రితం నగరంలో వరదలు సంభవించి హుస్సేన్ సాగర్ దిగువ ప్రాంతాలన్నీ జలయయమైన విషయం తెలిసిందే. ఆ సమయంలో వివిధ కమిటీలు అధ్యయనం చేసిన సిఫార్సుల్లో ఏ ఒక్కటి కూడా ఇంత వరకు అమలు చేయలేదని విమర్శిలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కురుస్తున్న వర్షాలతో నగరంలో రోడ్ల పై వరద నీరు ప్రవహిస్తూ లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. హుస్సేన్ సాగర్ కనుక పొంగితే పరిస్థితి మరింత దారణంగా వుంటుందని నగర వాసులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.
గవర్నర్ కు విహెచ్ ఫిర్యాదు
ఏపీఎన్జీఓ అధ్యక్షుడు అశోక్ బాబు పై గవర్నర్ కు ఫిర్యాదు చేసినట్లు కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు, సీనియర్ నేత వి.హనుమంతరావు తెలిపారు. ఢిల్లీలో గవర్నర్ నరసింహన్ తో భేటీ అయ్యి అనంతరం అశోక్ బాబు తక్కువ సమయంలో ఈ స్థాయికి ఎలా ఎదిగాడో గవర్నర్ కు వరించినట్లు ఆయన పేర్కొన్నారు. సీమాంధ్ర రాజకీయాలను ప్రభుత్వ ఉద్యోగి శాసిస్తున్నాడని ఆయన ఆరోపించారు. ఇప్పటికైనా సీమాంధ్ర నేతలు కళ్లు తెరవాలని సూచించారు. ఏ పార్టీకి ఓటు వేయాలో అశోక్ బాబు చెప్పడం సమంజసం కాదన్నారు.
(And get your daily news straight to your inbox)
Dec 26 | నేటి అర్థరాత్రి నుండి నగరంలోని చెత్త ఎక్కడికక్కడే పేరుకొని పోనుంది. హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని కార్మికులు నేటి అర్థరాత్రి (గురువారం) నుండి సమ్మెకు దిగబోతున్నారు. కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో జాప్యం... Read more
Dec 18 | నేతల అవినీతివల్లే ధరలు పెరిగిపోయాయని, అవినీతి కేన్సర్ లాంటిదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ నాయుడు పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో... Read more
Dec 17 | రాష్ట్ర విభజన బిల్లుపై శాసనసభలో చర్చ ప్రారంభమైందన్న వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో.. ప్రస్తుత శాసనసభ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేయించి విభజన బిల్లుపై మరోసారి ప్రత్యేక సమావేశాలు పెట్టించాలని ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి, సీమాంధ్ర మంత్రులు... Read more
Dec 16 | ఆంద్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును చైర్మన్ చక్రపాణి మండలిలో ప్రవేశ పెట్టిన నేపథ్యంలో శాసనమండలి మీడియా పాయింట్ వద్ద తెదేపా, తెరాస ఎమ్మెల్సీల మద్య వాగ్వాదం, తోపులాట జరిగింది. మండలి వాయిదా పడిన అనంతరం... Read more
Dec 13 | విభజనపై సీమాంధ్ర ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, 2014 సాధారణ ఎన్నికల లోపు రాష్ట్ర విభజన జరగదని చిన్ననీటి పారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ పేర్కాన్నారు. రాష్ట్ర విభజనకు పార్లమెంట్లో మూడింట రెండొంతుల... Read more