Ys jagan public meeting on lb stadium

ys jagan public meeting on LB stadium, YS Jagan Public Meeting at Hyderbad,YS Jagan Public Meeting, amaikya Sankaravam public meeting at LB Stadium, Samaikya Sankaravam public meeting

ys jagan public meeting on LB stadium

సమైక్యరాష్ట్రం కోసం ఏమైనా చేస్తారా?

Posted: 10/26/2013 04:20 PM IST
Ys jagan public meeting on lb stadium

హైదరాబాద్ లో ఏ ప్రాంత ప్రజలు కూడా భయభ్రాంతులకు గురి కావాల్సిన అవసరం లేదని వైఎస్ఆర్ సీపీ నేత రెహ్మాన్ అన్నారు. హైదరాబాద్ అందరిదని, హైదరాబాద్ నుంచి వెళ్లిపొమ్మనే అర్హత ఏ ఒక్కరికి లేదన్నారు. హైదరాబాద్ ఎవడబ్బ సొత్తు కాదని రణన్నినాదం చేశారు. 'జబ్ సీధీ ఉంగ్లీ సే ఘీ నహీ నికలీతో ఉంగ్లీ టేఢీ కర్నీ పడేగీ' (వేలు తిన్నగా ఉంచితే డబ్బాలోంచి నెయ్యి రాదు.. వేలు వంకరగా పెట్టాల్సిందే) అంటూ సమైక్యరాష్ట్రం కోసం ఏమైనా చేస్తామన్నారు.

 

ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న సమైక్య శంఖారావం సభలో రెహ్మాన్ మాట్లాడుతూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభంజనాన్ని చూసి గల్లీ నుంచి ఢిల్లీ వరకూ ప్రతి ఒక్కరూ వణికిపోతున్నారని అన్నారు. జగన్ ముఖ్యమంత్రి కాకుండా ఆపడం ఎవరి తరం కాదని స్పష్టం చేశారు. ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత వైఎస్ రాజశేఖరరెడ్డిదేనని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. సమైక్య శంఖారావం కోసం వస్తున్నవందలాది బస్సులను తెలంగాణ ప్రాంతాలలో నిలిపేశారని, పోలీసులు ఆ బస్సులను తక్షణమే అనుమతించాలని రాష్ట్ర డీజీపీ ప్రసాదరావుకు రెహ్మాన్ విజ్ఞప్తి చేశారు.

 

గట్టు రామచంద్రరావు

 

సమైక్య శంఖారావం సభలో వైఎస్సార్సీపీ నేత గట్టు రామచంద్రరావు మాట్లాడుతూ, ఇది 23 జిల్లాల సమైక్య శంఖారావం అని చెప్పుకొచ్చారు. ఈ సభకు అన్ని ప్రాంతాల వారు హాజరయ్యారని స్పష్టం చేశారు. తెలుగువారంతా ఏకంగా ఉండాలని 1911లోనే తీర్మానం జరిగిందని తెలిపారు. ఇది రెండు ప్రాంతాల మధ్య జరుగుతున్న ఘర్షణ కాదని.. రెండు వాదాల మధ్య జరుగుతున్న ఘర్షణ అని అభివర్ణించారు.

 

శోభ నాగిరెడ్డి

 

పార్లమెంటులో బిల్లును ఆపాలంటూ వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ఢిల్లీలో జాతీయ పార్టీలను కూడా కలిశారని ఆ పార్టీ నేత శోభానాగిరెడ్డి తెలిపారు. సమైక్య శంఖారావంలో ఆమె మాట్లాడుతూ, సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతిచ్చిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. తెలుగువారి సమైక్యతకు పార్టీ కట్టుబడి ఉందని ఆమె స్పష్టం చేశారు. తెలుగువారి సంస్కారం గురించి మాట్లాడుతూ పీవీ ప్రధాని అయిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు.

 

 

 

దాడి వీరభద్రరావు

 

సమైక్య శంఖారావం సభలో దాడి వీరభద్రరావు ప్రసంగిస్తూ.. పలు ఆసక్తిర అంశాలపై మాట్లాడారు. హైదరాబాదు తమకే కావాలని తెలంగాణ వారు పట్టుబట్టడం సరికాదన్నారు. విడిపోయే వారే కొత్త రాజధాని ఏర్పాటు చేసుకోవడం ఇప్పటి వరకు సంప్రదాయంగా వస్తోందని ఆయన గుర్తు చేశారు. గుజరాత్.. మహారాష్ట్ర నుంచి విడిపోయినప్పుడు ముంబయి కావాలని అడిగినా కేంద్రం అంగీకరించలేదని చెప్పారు. కొత్త రాజధాని ఏర్పాటు చేసుకోవాల్సిందే అని గుజరాత్ కు కేంద్రం స్పష్టం చేసిందని తెలిపారు. అప్పట్లో మద్రాస్ రాష్ట్రం నుంచి తెలుగువారు విడిపోయినప్పుడు కూడా కొన్నాళ్ళు కర్నూలు రాజధానిగా కార్యకలాపాలు నిర్వహించుకున్నామని దాడి వెల్లడించారు.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Ghmc labour go on flash strike

    సమ్మె సైరన్ మోగించిన మున్సిపల్ కార్మికులు

    Dec 26 | నేటి అర్థరాత్రి నుండి నగరంలోని చెత్త ఎక్కడికక్కడే పేరుకొని పోనుంది. హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని కార్మికులు నేటి అర్థరాత్రి (గురువారం) నుండి సమ్మెకు దిగబోతున్నారు. కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో జాప్యం... Read more

  • Nara lokesh counter on ys jagan

    జగన్ కు నారా లోకేష్ సవాల్

    Dec 18 | నేతల అవినీతివల్లే ధరలు పెరిగిపోయాయని, అవినీతి కేన్సర్ లాంటిదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ నాయుడు పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో... Read more

  • Nannapaneni rajakumari press meet

    ఇంతటితో ముగిద్దాం- నా మనసు గాయపడింది : నన్నపనేని

    Dec 17 | రాష్ట్ర విభజన బిల్లుపై శాసనసభలో చర్చ ప్రారంభమైందన్న వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో.. ప్రస్తుత శాసనసభ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేయించి విభజన బిల్లుపై మరోసారి ప్రత్యేక సమావేశాలు పెట్టించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, సీమాంధ్ర మంత్రులు... Read more

  • Ou students thrown stones on police

    పడిపోయిన నన్నపనేని-పోలీసులపై రాళ్లదాడి

    Dec 16 | ఆంద్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును చైర్మన్ చక్రపాణి మండలిలో ప్రవేశ పెట్టిన నేపథ్యంలో శాసనమండలి మీడియా పాయింట్ వద్ద తెదేపా, తెరాస ఎమ్మెల్సీల మద్య వాగ్వాదం, తోపులాట జరిగింది. మండలి వాయిదా పడిన అనంతరం... Read more

  • Tg venkatesh comment on telangana bill

    టి-బిల్లుతో పాటు డబ్బు సంచులు- అవసరం లేదు:టిజీ

    Dec 13 | విభజనపై సీమాంధ్ర ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, 2014 సాధారణ ఎన్నికల లోపు రాష్ట్ర విభజన జరగదని చిన్ననీటి పారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ పేర్కాన్నారు. రాష్ట్ర విభజనకు పార్లమెంట్లో మూడింట రెండొంతుల... Read more